వేమన పద్యరత్నాకరము - తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పిన
తనదు బాగుఁగోరి ధర్మంబు చెప్పిన
దిట్టుచుండ్రు మొఱకు లెట్టయెదుట
గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : తన బాగు కోరి మంచి చెప్పినవారిని మూర్ఖులు ముఖము ముందే తిట్టుదురు. దయతలచి తినుటకు గడ్డి వేయగా పోట్ల గొడ్డు పొడుచుటకు కొమ్ముల నాడించును.
No comments:
Post a Comment