వేమన పద్యరత్నాకరము - మంత్రమెల్ల మఱచి మధురాధరముఁ గోరి
మంత్రమెల్ల మఱచి మధురాధరముఁ గోరి
ఎట్లు మొఱకుఁ డొడయు నెఱుఁగఁగలఁడు?
ఉవిదఁజూచి పరమయోగంబు మఱచును,
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము : మూర్ఖుడు మంత్రము జపించుచు, స్త్రీ కనబడినచో ఆమెతో సుఖింపగోరును; గొప్పదైన యోగమును, మంత్రమును మరచును. ఆతడు దేవుని ఎరుగలేడు కదా!
No comments:
Post a Comment