భర్తృహరి పద్యం - పండిత వాక్కు
అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు.అవసరమైన మేరకు అవసరమైనంత మాట్లాడితేనే ఆ మాటలకూ ఆ వ్యక్తికీ విలువ ఉంటుంది.ఈ లక్షణం పండితులకు ఉంటుందని భర్తృహరి ఎంత
కరోతు కరట శ్శబ్దమ్,
సర్వదా ప్రాంగణే వసన్,
శశృణోతి బుధః ప్రీత్యా
శృణోతి పిక భాషితమ్.
అర్థం:కాకులు నిత్యం ఇంటి పెరట్లోనే ఉంటూ కావుకావు మంటూ అరుస్తూ ఉంటాయి. ఆ అరుపులను ఎవరూ ఇష్టంగా వినరు. అదే, కోకిలను తీసుకోండి... ఎప్పుడో ఒకసారి గళాన్ని విప్పుతుంది. మధురంగా కుహూ కుహూ అని కూస్తుంది. ఆ స్వరాన్ని విని అందరూ సంతోషపడతారు- అని భావం.
లోకం తీరు కూడా ఇంతే.అతిగా అనవసరంగా వాగే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. అందుకే పండితులూ జ్ఞాన సంపన్నులూ అవసరమైన మేరకే మితంగా మాట్లాడతారు. ఆ మాటలను అందరూ ఎంతో ప్రీతితో గౌరవంతో వింటారు.
No comments:
Post a Comment