వేమన పద్యం - ఎరుకమాలువాడు
ఎరుకమాలువాడు యేమేమి చదివిన
చదివినంత సేపు సద్గుణియగు
కదసి తామరందు కప్ప గూర్చుండదా?
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: ఏది చదివినా అది చక్కగా జ్ఞాపకముంచుకోవాలి. లేకపోతే చదువుచున్నంత సేపే సద్గుణి అగును. తామర మీద కప్ప కూర్చున్నంత సేపే దాని విశేషము.
No comments:
Post a Comment