వేమన పద్యరత్నాకరము - పరఁగఁ దానొసఁగఁడు పరులు చెప్పిననైన
పరఁగఁ దానొసఁగఁడు పరులు చెప్పిననైన
నియ్యఁ జాలక విధినెసగువాడు
పొట్టు తినెడి లోభి బువ్వను పెట్టునా?
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : మూర్ఖుడు తన యజమానుడు ఈయవలెనని చెప్పినను, తన కక్కరలేని వస్తువునైన ఇతరుల కీయడు. తానే పొట్టు తిను లోభి, ఇతరులకు అన్నము పెట్టడు గదా!
No comments:
Post a Comment