వేమన పద్యరత్నాకరము నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి
నీళ్ళుపోసి కడిగి నిత్యము శోధించి
కూడు పెట్టి మీద గోకకట్టి
యెన్నిపాట్లో పడుదు రీదేహమునకయి,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము : ఈ దేహము నశించునదే అని తెలియక జనులు నీళ్ళు పోసి, తోమి, గుడ్డలు కట్టి, తిండి పెట్టి, దీనికయి నానా కష్టములు పడుచుందురు. వీరి మూర్ఖత నేమందును?
No comments:
Post a Comment