ప్రసిద్ధ తెలుగు పద్యాలు - మనమునకుఁ బ్రియంబును హిత
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్.
తాత్పర్యము: సభలలో మనసుకు ప్రియంగా ఉండే హితవాక్యాలే పలకాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. ఆ మాట్లాడేదో సరళంగా ఎదుటివారు నొచ్చుకోని విధంగా మాట్లాడాలి. (సత్యవాక్యం విలువ)
No comments:
Post a Comment