ప్రసిద్ధ తెలుగు పద్యాలు - నుతజలపూరితంబులగు
నుతజలపూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత
వ్రత! యొక బావిమేలు, మఱి బావులు నూఱిటి కంటె నొక్క స
త్క్రతు వదిమేలు, తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతుశతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
తాత్పర్యము: నిండానీరున్న నూరు గోతుల కంటె ఒక బావి మేలు. నూరు బావుల కంటె ఒక్క క్రతువు (ప్రజాపతి) మేలు. నూరు క్రతువుల కంటె ఒక్క కుమారుడు మేలు. పరిశీలించగా నూరుగురు కుమారుల కంటె ఒకే ఒక సత్యవాక్యం - ఎక్కువ విలువైనదీ, ప్రియమైనదీ. (మహాభారతములో ధర్మరాజు వైభవం తెలిపే పద్యం)
No comments:
Post a Comment